Monday, May 6, 2024

బస్సును ఢీకొట్టిన మరో బస్సు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in Two buses collision at Aligarh

అలీఘర్: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలో చేర్చారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. లోధా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కర్సువా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అలీఘర్ నుంచి వస్తున్న హర్యానా రోడ్‌వేస్ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ దాటి ఖైర్ నుండి వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Five killed in Two buses collision at Aligarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News