Thursday, May 9, 2024

వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister malla reddy Participated in MLC election campaign

బోడుప్పల్: పివి కూతురు, విద్యావేత్త సురభి వాణిదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారీమెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోడుప్పల్ టిఆర్‌ఎస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మేడిపల్లిలోని ఎస్వీఎమ్ హోటల్‌లో ఇంచార్జ్‌లతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపి నేతకాని వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఇంచార్జ్ అంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు చామకూర భధ్రారెడ్డిలతో కలిసి మంత్రి హజరై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కార్పొరేషన్ లో ప్రతిఒక్కరూ వాణిదేవి గెలుపునకు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలియచేసి పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు. ఎంపి వెంకటేష్ నేత మాట్లాడుతూ… వాణిదేవిని గెలిపించాల్సిన బాధ్యత పట్టభద్రుల అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ టిఆర్ఎష్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్ ,కార్పొరేటర్లు ,కో-ఆప్షన్ సభ్యులు ,పార్టీ శ్రేణులు,కార్యకర్తలు,డివిజన్ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News