Friday, May 3, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన రెండు ప్రదేశాలలో ఐదుగురు నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక నక్సల్‌కు 2015లో నలుగురు పోలీసులను నిర్బంధించి హతమార్చిన సంఘటనతో సంబంధమున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నెలస్నర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-63 సమీపంలో ఒక మహిళతో సహా నలుగురు నక్సల్స్ అరెస్టు కాగా కుట్రు పోలీసు స్టేషన్ పరిధిలోని చింజెర్ గ్రామ సమీపంలో మరో నక్సల్ అరెస్టు అయినట్లు పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన నక్సల్స్‌ను మోటోరాం అతామి(25), శంకర్ ఇస్టమి(22), ఆయతురామ్ కోవసి(22), తుల్సీ పొయామి(19)గా పోలీసులు గుర్తించారు. 2015 జులైలో నలుగురు సహాయ కానిస్టేబుల్స్‌ను అపహరించి హతమార్చిన సంఘటనతో సంబంధమున్న బద్రు మిచ్చ(30) అనే నక్సల్ కూడా ఈ ఐదుగురిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

Five Maoists Arrested in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News