Saturday, May 11, 2024

లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Bus Accident

 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో మంగళవారం ఆర్‌టిసి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెచ్‌ఆర్‌టిసి బస్సు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి చంబాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చంబా మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు యోగేష్ కుమార్(47), పూజాకుమారీ(28), రాజీవ్ కుమార్(37), మనిరామ్(33), దావత్ అలీ(30)గా గుర్తించారు.

 

Five Members dead as bus fell into Gorge in Chamba
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News