Monday, April 29, 2024

ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్

- Advertisement -
- Advertisement -

Madhya Pradesh

 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్‌కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో చేరునన్నారు. సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేసి గవర్నర్‌కు పంపించారు. కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి, రాజీనామా లేఖను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి  పంపించారు. ప్రధాని నరేంద్ర మోడీతో సింధియా సమావేశమైన అనంతరం కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంపి సీటుకు రాజీనామా చేశారు. సింధియా 18 ఏళ్లుగా కాంగ్రెస్‌కు సేవలందించారు. కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించకపోవడంతోనే రాజీనామా చేశానని సింధియా మీడియాకు తెలిపారు.

 

Madhya Pradesh Six ministers resign Letter to Govr

 

Several ministers resign in Madhya Pradesh
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News