Sunday, May 5, 2024

ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపింది కెసిఆరే: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Floride decrease with KCR ruling

నల్లగొండ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కెసిఆర్ ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి సురక్షిత మంచినీళ్లు ఇవ్వాలని అప్పుడే కెసిఆర్ సంకల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిందని జగదీష్ రెడ్డి కొనియాడారు. సిఎం కెసిఆర్ రేయింబవళ్లు శ్రమించి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేశారని, కెసిఆర్ సంకల్ప సిద్ధికి మిషన్‌భగీరథ పథకం నిదర్శనమన్నారు. ఈ సమావేశానికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, జడ్‌పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News