- Advertisement -
భోపాల్: ఎవరు ఎప్పుడు ఎలా కన్నుమూస్తారో ఎవరికీ తెలియడం లేదు. తాజాగా దేవుడి గుడిలో మాజీ ఎంఎల్ఎ ప్రార్థనా చేస్తూ కన్నుమూసిన సంఘటన మధ్యప్రదేశ్లోని బైతూల్లో జరిగింది. ఈ సంఘటన అక్కడ ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తమైంది. బైతూల్ మాజీ ఎంఎల్ఎ వినోద్ డాగా పూజ చేసేందుకు దాదావాడీలో దేవుడి మందిరానికి వచ్చాడు. దేవుడి గుడిలో పార్శనాథునికి పూజ చేసిన అనంతరం గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేశాడు. అనంతరం దేవుడి ముందు నిలబడి పూజ చేస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. సెకన్ల వ్యవధి పాటు కదిలి ప్రాణాలు విడిచాడు. బాలుడు మందిరంలోకి వచ్చి ఎంఎల్ఎ కిందపడటాన్ని గమనించి, పూజారికి సమాచారం ఇచ్చాడు. వినోద్ను లేపడానికి పూజారి ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని తెలిపారు.
- Advertisement -