- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల నుంచి 40 వేలకు లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 435 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 88.45 లక్షలకు చేరుకోగా 1.3 లక్షల మంది మృత్యువాతపడ్డారని పేర్కొన్నారు. కరోనా వ్యాధి నుంచి 82.49 లక్షల మంది కోలుకోగా 4.65 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఒక్క రోజు 8.61 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 12.56 కోట్లకు చేరిందని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -