Friday, May 17, 2024

ఊరి చెరువులో మునిగి నలుగురు పిల్లల మృతి

- Advertisement -
- Advertisement -

Four children drowned in village pond

 

భావ్‌నగర్ (గుజరాత్): భావ్‌నగర్ జిల్లా మోటివావ్డి గ్రామం చెరువులో స్నానం చేస్తూ నలుగురు పిల్లలు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మరీ చిన్నారులు. 10 నుంచి 13 ఏళ్ల లోపు ఈ పిల్లల మృతదేహాలను సోమవారం అర్థరాత్రి దాటాక బయటకు తీయడమైందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వ ప్రాజెక్టు వల్ల ఈ చెరువు ఇటీవలనే బాగా నిండిందని, సోమవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన వారు తిరిగి ఎంతకూ రాకపోవడంతో వారి కుటుంబీకులు గాలింపు చేపట్టారని పోలీసులు చెప్పారు. పిల్లల సైకిళ్లు, చెప్పులు చెరువు వద్ద కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక, పోలీస్ శాఖల సహాయక బృందం రంగం లోకి దిగి సోమవారం అర్థరాత్రి దాటాక మృతదేహాలను వెలికి తీయగలిగారు. మృతులు తరుణ్ ఖోఖాని (10) అతని సోదరుడు మీట్ ఖోఖాని (12), మొంతు భేడా (13),.జయేష్ కకాడియా (12)గా గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News