- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,066 మందికి పరీక్షలు నిర్వహించగా 180 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎపి ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. వీటిలో రాష్ట్రానికి చెందినవి 79 కేసులు ఉండగా… విదేశీయులు, పొరుగు రాష్ట్రాలకు చెందినవారే 101మంది ఉన్నారు. దీంతో ఎపిలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 3,279 చేరాయి.
రాష్ట్రంలో కరోనాతో మరో నలుగుగు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఎపిలో ఇప్పటివరకు 68మంది చనిపోయారు. ఇప్పటివరకు 2,244మంది కరోనాతో కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 967మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Four Died of Coronavirus in Andhra Pradesh
- Advertisement -