Saturday, May 4, 2024

పెళ్లికి రెండు రోజుల ముందు యువతి, తండ్రిపై కాల్పులు…. (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

Girl ang father shot dead by stalker before wedding

లక్నో: పెళ్లికి రెండు రోజుల ముందు యువతి, ఆమె తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దళిత వర్గానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన కుమార్తె అంచల్ వివాహం జూన్-29న చేయాలని ముహూర్తం పెట్టాడు. గత కొన్ని రోజుల నుంచి అంచల్‌ను పెళ్లి చేసుకుంటానని సాగర్ ఠాగూర్ యువతితో చెప్పాడు. సదరు యువతి అతడిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.  జూన్ 27 రాత్రి పెళ్లి కార్యక్రమాల సందర్భంగా ఇంట్లో ఆట పాటలతో సంతోషంగా గడుపుతున్న సందర్భంలో అర్ధరాత్రి సాగర్ తన ఐదుగురు స్నేహితులు రోహిత్, అంకిత్, నీరజ్, ప్రిన్స్‌తో కలిసి అంచల్ వాళ్ల ఇంటికి వచ్చాడు. అంచల్, ఆమె తండ్రి రాజ్‌కుమార్ పై సాగర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఇంట్లో కుటుంబ సభ్యుల పరుగులు తీశారు. తరువాత అంచల్ వాళ్ల సోదరుడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. గ్రామస్థులు గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అంచల్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆమె తండ్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆమె సోదరుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నీరజ్, ప్రిన్స్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

https://www.youtube.com/watch?v=KAPqYEYz0lc

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News