- Advertisement -
పనాజి: గోవా వెళ్లే మందుబాబులకు అక్కడి సర్కార్ ఝలక్ ఇచ్చింది. మద్యం ధరల పెంపుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గోవా వెళ్లి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. గోవా ప్రభుత్వం మద్యం రేట్లను 20శాతం నుంచి 50శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యుడిపై పన్నుల భారం వేయకుండా ఎక్సైజ్ డ్యూటీని పెంచాలని గోవా ప్రభుత్వం భావిస్తోంది.
Goa to increase alcohol price from April
- Advertisement -