Thursday, May 16, 2024

ఎస్ఐని చంపిన మేకల దొంగలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: మేకల దొంగలను పట్టుకున్న ఎస్‌ఐని చంపేసిన సంఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నవల్‌పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నలుగురు నిందితులలో ముగ్గురిని పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నలుగురు దొంగలు మేకలను దొంగలించి తీసుకెళ్తుండగా వారిని ఎస్‌ఐ భూమి నాథన్ పట్టుకున్నాడు. తమను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా వారు వినకపోవడంతో పాటు ఎవరికో ఎస్‌ఐ ఫోన్ చేశాడు. వెంటనే దొంగలు ఎస్‌ఐని కత్తులతో పొడిచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఎస్‌ఐ చనిపోయాడు. వెంటనే ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయగా నిందితులలో మణిగండన్ (19) అనే దొంగ దొరికాడు. ఇతడి సహాయంతో మరో ఇద్దరు మైనర్లను పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News