Saturday, April 27, 2024

అప్పుల బాధ తాళలేక ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

నందిపేట్ మండలం ఖుద్వాన్ పూర్ ఉన్నత పాఠశాలలో సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న బొజ్జ శ్రీధర్ అప్పుల బాధతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి స్వగ్రామంలో ప్రభుత్వ టీచర్ నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం టీచర్ మృతి చెందారు. మృతుడి తండ్రి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అప్పుల భాధ భరించలేక తమ కుమారుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News