- Advertisement -
అమరావతి: రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎట్టకేలకు రాష్ట్రంలో అడుగుపెట్టారు. అయితే, మొదట చంద్రబాబు నేరుగా విమానంలో విశాఖకు వెళ్లి, అక్కడ ఎల్జీ పాలిమర్స్ విష వాయువు ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించాలని భావించారు. సోమవారం విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖ పర్యటనను విరమించుకొని రోడ్డు మార్గంలోనే ఎపికి వెళ్లారు.రోడ్డు మార్గంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల సరిహద్దు గరికపాడు చెక్పోస్టు వద్ద చంద్రబాబు కాన్వాయ్ వాహనాలను ఎలాంటి తనిఖీ చేయకుండానే అనుమతించారు. కాగా, కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు అక్కడే చిక్కుకుపోయారు.
Grand Welcome to Chandrababu in AP
- Advertisement -