- Advertisement -
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘గల్లీరౌడీ’ చిత్రాన్ని సెపెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘Gully Rowdy’ Movie Released on Sep 17
- Advertisement -