Saturday, April 27, 2024

సిద్దిపేట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao reacts on high court orders over omicron

సిద్దిపేట: కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వం లో 2021లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని, ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా ఉందామన్నారు. గత ఏడాది అంతా సుఖ సంతోషాలతో గడిచినట్లే, ఈ ఏడాది మీ కుటుంబాల్లో, సుఖ, శాంతులతో విలసిల్లాలని కోరుతున్నామన్నారు.

నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం జరుపుకోవాలని కోరుతున్నామని, అందరూ మాస్క్ లు ధరించిడంతో పాటు భౌతిక దూరం పాటించాలను సూచించారు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం విద్యార్థులు,యువత నూతన లక్ష్యాలు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది నాటికి వాటిని మీరు‌ చేరుకునేలా కష్ట పడాలన్నారు. 2021 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2022 లోకి అడుగుపెడుతున్న ప్రజలకు శుభం కలగాలని కోరుతున్నామని అందరికీ ” హ్యాపీ న్యూ ఇయర్ ” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News