- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ పాల ధరలు పెంచింది. లీటర్ పాలపై 2 రూపాయలు పెంపు, హోల్ మిల్క్ పై 4 రూపాయలు పెంచుతున్నట్టు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ శుక్రవారం ప్రకటించింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. పెంచిన ధరలకు వినియోగదారులు సహకరించాలని కోరింది.
- Advertisement -