Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్ పోరాటానికి భయపడే రుణమాఫీ ప్రకటన: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆరోపించారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సిఎం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం బిఆర్‌ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకరానికి రూ. 150 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు.

వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు..? అని, మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది..? అని నిలదీశారు. రూ.4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారు..? అని అడిగారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News