Saturday, April 27, 2024

సిఎం కెసిఆర్ దైవభక్తితోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయంను సందర్శించి స్వామి వారిని దర్శించుకుని రూ.40 లక్షల రూపాయల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేసీఆర్ నిఖార్సయిన హిందువు.  ఆయనకు ఉన్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రూ.1200 కోట్లతో యాదాద్రి టెంపుల్ ను అభివృద్ధి చేశారు. 600 కోట్ల రూపాయలతో కొండగట్టు అభివృద్ధి చేస్తున్నారు.

అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 10,000 దేవాలయాల్లో దూపాదీప నైవేద్యం కొరకు రూ.6000 వేలను రూ.10,000కు పెంచి ఇస్తున్నాం. పోట్లపల్లి గ్రామంలో 140 దేవాలయాలు ఉన్నాయనే వాళ్ళు అలాంటి గ్రామంలో రూ.40 లక్షల రూపాయలతో రామాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తా. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుంచి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయి. ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం. ఇవాళ రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చింది కేసీఆర్” అని అన్నారు.

Also Read: ఎంపి డింపుల్ యాదవ్‌పై అభ్యంతరకర పోస్ట్.. కేసు నమోదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News