Saturday, April 27, 2024

నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని

- Advertisement -
- Advertisement -

నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని
నేడు పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలు
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి,
సిఎంగా కెసిఆర్ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది
స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ డయాలసిస్ సేవలను విస్తృతం చేశారు
ట్విట్టర్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను 102కు పెంచి సిఎం కెసిఆర్ డయాలసిస్ సేవలు విస్తృతం చేశారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి ట్వీట్ చేశారు. నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని… వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అని పేర్కొన్నారు. కానీ నేడు స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సిఎం కెసిఆర్ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశారని తెలిపారు. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, సిఎం కెసిఆర్ పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయని వ్యాఖ్యానించారు.

సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని సగర్వంగా చెప్తున్నామన్నారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా, పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్‌పాస్‌లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సిఎంగా కెసిఆర్ ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైందన్నది అక్షర సత్యమని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News