Friday, April 26, 2024

పేలిన తుపాకీ… కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

Head constable dead with miss fire in Andhra

 

అమరావతి: చేతిలో ఉన్న తుపాకీ పేలడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లక్ష్మీ నారాయణ రెడ్డి(47) అనే హెడ్ కానిస్టేబుల్ గత సంవత్సరం నుంచి సబ్ జైలు వద్ద గార్డుగా పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకున్న అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వెళ్లి తుపాకీ పక్కకు పెట్టి దుస్తువులు మార్చుకుంటుండగా తుపాకీ పేలింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పి వెంకట అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి నారాయణ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News