- Advertisement -
మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. 13 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి ఐదు యూనిట్లలో కొనసాగుతుంది. జూరాలకు ఇన్ ఫ్లో 87 వేల క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 1.12 లక్షలుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు వైపే 88 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- Advertisement -