Saturday, April 27, 2024

కాలి నడకన తిరుమలకు హీరో విశాల్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: హీరో విశాల్ స్వామివారిని దర్శించుకునేందుకు కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. తాను నటించిన ‘ఎనిమి’ చిత్రం విజయం సాధించాలని కోరుతూ, స్వామివారి ఆశీస్సుల కోసం విశాల్ బుధవారం అలిపిరి కాలిబాట మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారకి ప్రత్యేక పూజలు చేసిన మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను విశాల్ కు అందజేశారు. కాగా, ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన యాక్షన్ మల్టీస్టారర్ ‘ఎనిమి’. మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Hero Vishal reach to Tirumala by foot way

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News