Thursday, May 9, 2024

మహబూబ్ నగర్ లో దారుణం: వైద్యం వికటించి బాలింత మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎస్ విఎస్ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వైద్యం కోసం మూడు రోజుల క్రితం ఎస్ విఎస్ ఆస్పత్రిలో చేరిన కల్వకుర్తి మండలం జీడిపల్లికి చెందిన మమత అనే బాలింత బుధవారం ఉదయం మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపు చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Balintha died as treatment fails at SVS Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News