Monday, May 6, 2024

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన హోంమంత్రి

- Advertisement -
- Advertisement -

Home Minister inaugurating blood donation camp

అంబర్‌పేట హెడ్ క్వార్టర్స్‌లో శిబిరం
పాల్గొన్న నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం తెలంగాణ హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్లు ఫైవ్ స్టార్ హోటళ్ల వలే ఉన్నాయని అన్నారు. సిసి టివిల ఏర్పాటు కోసం మినిస్టర్ కోటాలో రూ.2కోట్లు విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె వెంకటేష్, నగర సిపి అంజనీకుమార్, అదనపు పోలీస్ కమిషనర్లు శిఖాగోయల్, అనిల్‌కుమార్, డిఎస్ చౌహాన్, జాయింట్ సిపి రమేష్, కమాండెంట్ మురళీధర్, అసిస్టెంట్ కమాండెంట్ త్రిలోక్‌నాథ్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News