Wednesday, May 1, 2024

తిరుమలకు భారీగా భక్తులు.. దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, శనివారం శ్రీవారిని 82,265 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 41,300మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News