Sunday, May 19, 2024

తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 34,632 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 16,399 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.19 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. టిటిడి చరిత్రలో మొదటిసారిగా ఏకాంతంగా రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. శ్రీవారు సప్త వాహనాలపై వేంచేయనున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టిటిడి తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.

Huge Devotees visited Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News