- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మాంగార్ బస్తీలో సోమవారం అర్ధరాత్రి యువకులు హల్ చల్ చేశారు. కత్తులు, ఇనుపరాడ్లతో 50 మంది పోకిరిలు హంగామా సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు తలుపులు, రేకులు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఓ కుటుంబంపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ ప్రత్యర్థలతో తిరుగుతున్నాడని విజయ్ రామ్ అనే వ్యక్తిపై మరో వర్గం దాడి చేసింది. అర్జున్, ధన్ రాజ్, వికాస్, సాయిరాం బృందం దాడి చేసినట్టు బాధితులు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
Hulchal of late night youth at Mangar Basti
- Advertisement -