Saturday, April 27, 2024

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband killed wife in kukatpally

మన తెలంగాణ/ కూకట్‌పల్లి: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇంట్లో ఎవరులేని సమయంలో గొంతునులిమి భార్యను హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ తన తల్లిదండ్రులతో కలిసి మూసాపేటలో నివాసముంటూ స్ధానిక వల్డింగ్ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో పుణ్యవతి(20)ని వివాహమాడాడు. సంతోష్ పెళ్లైన కొద్ది రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న సంతోష్ ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని షరతులు విధించి వేధింపులకు గురుచేసేవాడు.

ఇదే క్రమంలో పుణ్యవతి తల్లిదండ్రులు, బంధువులు పలుమార్లు సంతోష్‌కు నచ్చజెప్పి భార్యతో కలిసి ఉండాలని సూచించినా సంతోష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నిత్యం గొడవలు జరిగేవి. గురువారం సాయంత్రం నుండి సంతోష్ ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు శుక్రవారం తలుపులు తెరిచి చూడగా పుణ్యవతి విగత జీవిగా కనిపించింది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ స్ధానిక పోలీస్ స్టేసన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంతోష్ మృతురాలని గొంతు నులిమి హత్యకు పాల్పడి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ పరారైన సంతోష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News