Saturday, May 4, 2024

పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి భార్యను లోయలో తోసేసి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భార్యను భర్త పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లోయలోకి తోసేసిన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజేష్ రాయ్ అనే వ్యక్తి(29) ఢిల్లీలో బబిత (24) అనే యువతిపై అత్యాచారం చేశాడు. బబిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బబిత మనసు మార్చుకొని కేసును వెనక్కి తీసుకుంది. రాజేష్ జైలు నుంచి విడుదల కాగానే బబితను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఆమెను అతడు శారీరకంగా హింసించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని రోజుల తరువాత ఆమె వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. పర్యాటక ప్రదేశాలకు వెళ్తామని చెప్పి ఉత్తరాఖండ్‌లోని ఉదమ్ సింగ్ నగర్‌కు తీసుకెళ్లాడు. ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్లిన తరువాత ఆమెతో గొడవ పెట్టుకొని అక్కడ నుంచి కిందకు నెట్టేశాడు. అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌ను అరెస్టు చేయగా కొండమీద నుంచి తోసేసినట్టు వెల్లడించారు. ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News