- Advertisement -
లక్నో: లాక్డౌన్ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండిపోయిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ విధించే సమయానికి రాకేష్ సోనీ అనే వ్యక్తి భార్య తన అమ్మగారింట్లో ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ఆమె తన భర్త రాకేష్ వద్దకు రావడానికి వీలుపడలేదు. దీంతో రాకేష్ తన భార్య దగ్గరకు వెళ్లలేనని రోజు మదనపడేవాడు. ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కాక మనోవేధనకు గురయ్యాడు. భార్య లేకుండా తాను ఉండలేనని గ్రహించిన రాకేష్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Husband suicide with wife stuck in parents House
- Advertisement -