Saturday, May 4, 2024

మొదటి భార్య చెవులు ముక్కు కోసి… రెండో భార్యపై పెట్రోల్ పోసి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మొదటి భార్య ముక్కు, చెవులు కోసి, రెండో భార్యపై భర్త పెట్రోల్ పోసి తగలబెడుతుండగా పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కల్యాణం వెంకన్నకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలతో ఎప్పుడు వెంకన్న గొడవలు పడుతుండేవాడు. వారం రోజుల క్రితం మొదటి భార్యతో గొడవ పెట్టుకొని చెవులు, ముక్కు కోయడంతో వరంగల్‌లో సమీపంలో తన తల్లి గారింటికి వెళ్లిపోయింది. రెండో భార్యకు మాయమాటలు చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టపోతుండగా వారి నుంచి తప్పించుకొని భద్రాచలంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకన్న అత్తగారింటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకుంటుండగా ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News