Wednesday, May 1, 2024

బెంగళూరును దాటేసిన హైదరాబాద్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో బెంగళూరు, హై-దరాబాద్‌ల మధ్య చాలా కాలం నుంచే పోటీ వాతావరణం సాగుతున్న సంగతి విదితమే. ఐటి రంగంలో తొలి స్థానంలో ఉన్న బెంగళూరును దాటేసి ఆ స్థానంలో హైదరాబాద్‌ను నిలపాలన్న కసితో తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చాలా కాలంగా శ్రమిస్తున్నారు. ఈ దిశగా ఏ చిన్న అవకాశం దొరికినా దానిని ఆయన వదలడం లేదు. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో శనివారం ఓ కథనం ప్రచురితమైంది. ఆఫీసు స్పేస్ లీజులో బెంగళూరు నగరాన్ని దాటేసిన హైదరాబాద్ ఈ విభాగంలో టాప్ పొజిషన్‌లోకి దూసుకెళుతోందంటూ ఆ కథనం పేర్కొంది. ఇదే కథనాన్ని కోట్ చేస్తూ కెటిఆర్ శనివారం ఓ ట్వీట్ చేశారు. ఆఫీసు స్పేస్ లీజులో హైదరాబాద్ సత్తా చాటుతున్నదని పేర్కొన్న కెటిఆర్, అందుకు గల కారణాలను కూడా ప్రస్తావించారు. తక్కువ అద్దెలే ఆఫీసు స్పేస్ లీజుల్లో హైదరాబాద్‌ను అగ్రస్థానానికి తీసుకెళుతున్నాయని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News