Monday, April 29, 2024

జర్మనీలో నగర యువకుడి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీ వెళ్లిన నగర యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కార్వాన్ సబ్జిమండికి చెందిన కట్టా వినయ్‌కుమార్(27) మాస్టర్స్ చదివేందుకు 2016లో జర్మనీ వెళ్లాడు. ఈక్రమంలో వినయ్‌కుమార్ నివాసముంటున్న మూడంతస్థుల భవనంపై నుంచి పడి మృతి చెందినట్లు ఈనెల 3న తల్లిదండ్రులకు సమాచారం అందింది.

రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చి వెళ్లిన అతను గత నెలలో మళ్లీ రావాల్సిం ఉండగా కరోనా నేపథ్యంలో రాలేకపోయాడని, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడు మృతి చెంది ఇప్పటికే పది రోజులు దాటిందని, మరింత ఆలస్యం కాకుండా మృతదేహాన్ని ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News