Friday, May 3, 2024

భారతీయ గాధలను వేడుక చేసుకునేలా ఎన్డీ టీవీపై నూతన సిరీస్..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ మనీ.కామ్ లో భాగమైన ఫ్రీడమ్ యాప్ ఈ తరహాలో మొదటిదిగా ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ షో ను ఎన్డీటీవీ నెట్ వర్క్ పై ప్రసారం చేయనుంది. ఇప్పటి వరకూ వినని రీతిలో భారతీయ రైతులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, గృహిణుల విజయగాధలను ఈ షో వేడుక చేయనుంది. వీరంతా చూసేందుకు సాధారణ జీవితాలను గడుపుతున్నట్లుగా అనిపించవచ్చు, కానీ అసాధారణ జీవితాలకు వారు సారథ్యం వహించారు. తమ నైపుణ్యాలను లాభదాయ సాగు, వ్యాపార కార్యకలాపాలుగా మలు చుకున్నారు.

ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది ఒక టెలివిజన్ సిరీస్. మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్న ప్రజానీకం నిజజీవితగాధలను అది వేడుక చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు, సేద్యం లేదా ఇంటి నుంచే మరేదైనా వ్యాపారం ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపర్చుకోవడం ద్వారా ఆర్థిక విజయాలు సాధిం చేందుకు ఎన్నో రకాల అడ్డంకులను అధిగమించిన అలాంటి పారిశ్రామికవేత్తలు, రైతులందరినీ మేం గౌరవి స్తున్నాం. 14 ఎపిసోడ్ సిరీస్ ఎన్డీ టీవీలో 2022 జూన్ 5నుంచి ప్రసారం కానుంది. ఆదివారం రాత్రి 9.30 గంటల నుంచి 10.30గంటల వరకు, రిపీట్ ఎపిసోడ్ శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

మనం భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకుంటున్న నేపథ్యంలో ఐకాన్స్ ఆఫ్ భారత్ అనేది కల కనేందుకు సాహసించిన వారి అసాధారణ ధైర్యసాహసాలను, స్ఫూర్తిని వేడుక చేసుకునే వేదికగా ఉండాలని ఎన్డీటీవీ ఇండియా భావిస్తోంది. తమ తమ రంగాల్లో విజయాలు సాధించిన ప్రజల విజయగాధలను ప్రదర్శించడం ద్వారా లక్షలాది భారతీ యులకు స్ఫూర్తి కలిగించాలని ఐకాన్స్ ఆఫ్ భారత్ కోరుకుంటోంది. వ్యవసాయం, హోమ్ బేకింగ్, క్యాండిల్ మేకింగ్, చాకొలెట్-మేకింగ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఇంకా మరెన్నో రంగాల నుంచి ఈ ఐకాన్స్ ఉంటారు. ఒక నైపుణ్యాన్ని పొందేందుకు పెద్దగా విద్యార్హత లేదా పెద్ద డిగ్రీ అవసరం లేదని, నేర్చుకోవాలనే కల, పాత కాలపు భావనలను బద్దలుగొట్టాలనే సంకల్పం ఉంటే చాలనే విషయాన్ని భారతీయులు గుర్తించేలా చేయ డం ఈ షో లక్ష్యం. శ్రీ సిఎస్ సుధీర్ ప్రారంభించిన ffreedom app యాప్ వంటి వేదికల ద్వారా కావాల ను కున్న నైపుణ్యాలను సాధించడం సులభమైపోయింది. ఇక ఇప్పుడు కావాల్సిందల్లా వ్యాపారం నిర్మించుకో వడం ద్వారా తమ జీవితాలను మార్చుకోవాలనే దృఢ సంకల్పం మాత్రమే.

ఈ సందర్భంగా ఇండియన్ మనీ.కామ్ వ్యవస్థాపకులు, సీఈఓ సిఎస్ సుధీర్ మాట్లాడుతూ, ‘‘భారతదేశం అంతర్జాతీయ సూపర్ పవర్ అయ్యే మార్గంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారి తీసే రీతిలో ప్రతీ ఆంత్రప్రె న్యూర్, ప్రతీ రైతు తన వంతు తోడ్పాటు అందిస్తేనే అది సాధ్యపడుతుంది. అయితే తరచూ దీన్ని విస్మరి స్తుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఐకాన్స్ ఆఫ్ భారత్’ వెనుక ఉన్న ఆలోచన ఉద్భవించింది.ఇలాంటి వారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం. అంతేకాదు, ప్రస్తుత, రేపటి తరాలను ప్రభావితం చేసే శక్తి కూడా వారికి ఉంది’’ అని అన్నారు.

ఈ సందర్భంగా ఎన్డీ టీవీ సహవ్యవస్థాపకులు డాక్టర్ ప్రణయ్ రాయ్ మాట్లాడుతూ, ‘‘ఐకాన్స్ ఆఫ్ భారత్’’ తో అనుబంధం ఏర్పరచుకునేందుకు ఎన్డీ టీవీ ఎంతో సంతోషిస్తోంది. భారతదేశంలోని విజయగాధలపై ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ మనీ యొక్క ఫ్రీడమ్ ప్లాట్ ఫామ్ తో పని చేయడం చూస్తుంటే, ఈ షో కో ట్లాది మంది భారతీయులకు తప్పకుండా స్ఫూర్తి కలిగిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

ఒక విశిష్టమైన స్టోరీ ఆధారిత ఫార్మాట్ లో ఉండే ఈ కార్యక్రమం ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతూ, మరెంతో మందికి ఉద్యోగాలను కల్పిస్తూ, విభిన్న రీతిలో తమ జీవనోపాధులను నిర్మించుకున్న ప్రజలను సత్కరి స్తుంది. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఈ ఐకాన్స్ ఆఫ్ భారత్ తమ కార్యకలాపాలను ప్రారంభించారు లేదా రైతులు సాగు విధానాలను మెరుగుపరిచేందుకు నూతన విధానాలను కనుగొన్నారు. దేశవ్యాప్తంగా వీక్షకులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, దేశ ఆర్థికాభివృద్ధి ని ముందుకు తీసుకెళ్లే శ్రామిక శక్తిలో భాగమయ్యేందుకు వారిని ప్రోత్సహించడం ఈ షో లక్ష్యం.

ఐకాన్స్ ఆఫ్ భారత్ విజయగాధలు ఫ్రీడమ్ యాప్ పై అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యాపారం ఎలా చేయాలి, ఏదైనా సూక్ష్మ సంస్థ స్థాపించాలనుకుంటే అందుకు స్ఫూర్తినిచ్చే వారి వివరాలు ఉంటాయి.ఈ కార్యక్రమంలో భాగంగా 60 మంది ఐకాన్స్ ఆఫ్ భారత్ విజయగాధలు ప్రదర్శించబడుతాయి. ప్రతీ ఎ పిసోడ్ 5 మంది ఐకాన్ల గురించి ఉంటుంది. వారిలో ఒకరు ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’గా సన్మానించబడుతా రు. ఈ ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’ లలో ఒకరు అంతిమంగా మా షో ఫైనల్ లో ‘సర్వశ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్’ గా సన్మానించబడుతారు. ఈ ప్రక్రియలో జ్యూరీ మాకెంతగానో తోడ్పడుతుంది.షో జ్యూరీలో సూపర్ 30 ప్రోగ్రామ్ కు ప్రసిద్ధి చెందిన భారతీయ మేథమేటిక్స్ ఎడ్యుకేటర్ ఆనంద్ కుమార్, రశ్మి బన్సాల్ ఆథర్, ఆంత్రప్రెన్యూర్ రశ్మి బన్సాల్, ఎంబీఏ చాయ్ వాలా గా పేరొందిన మోటివేషనల్ స్పీక ర్ ప్రఫుల్ బిల్లోర్, ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్ చైర్మన్, టై దిల్లీ – ఎన్సీఆర్ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి స భ్యులుగా ఉంటారు.

ఐకాన్స్ ఆఫ్ భారత్ ఇప్పడు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. iconsofbharat.com లింక్ ద్వారా లేదా ఫ్రీడ మ్ యాప్ ద్వారా ప్రజ లు తమ ఎంట్రీలను సమర్పించవచ్చు.శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – ఆడియన్స్ చాయిస్ అవార్డు కు గాను ఓటేయాల్సిందిగా వీక్షకులను ఈ షో కో రుతోంది. ఫ్రీడమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా వీక్షకులు తమ ఫేవరేట్ ఐకాన్స్ కు ఓటేయవ చ్చు. శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – ఆడియెన్స్ చాయిస్ వోటింగ్ విండో ఆదివారం 9.30 నుంచి బుధవారం అ ర్థరాత్రి వరకు ఓపెన్ గా ఉంటుంది. ఆడియన్స్ నుంచి అత్యధిక సంఖ్యలో ఓట్లు పొందిన ఐకాన్ ఆ నిర్దిష్ట ఎ పిసోడ్ కు ‘శ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్- ఆడియెన్స్ ఛాయిస్’ గా అవార్డు పొందుతారు. అత్యధిక సంఖ్యలో వీక్ష కుల ఓట్లను పొందే ఐకాన్ ‘సర్వశ్రేష్ఠ ఐకాన్ ఆఫ్ భారత్ – సీజన్ 1’ టైటిల్ అవార్డు పొందుతారు. ఇండియన్ మనీ.కమ్ భారతదేశ అతిపెద్ద లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్. రైతులు, చిన్న వ్యాపారులకు అవసరమైన నాలెడ్జ్ ను, అవకాశాలను అందిస్తుంది. వారి ఆకాంక్షలు, సామర్థ్యాలకు మధ్య ఉండే అంతరాన్ని తొలగిస్తుంది. ఫ్రీడమ్ యాప్ పై ఇప్పుడు ఫామింగ్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ వంటి టాపిక్స్ లో 750కి పైగా కోర్సులను 6 భాషల్లో దేశవ్యాప్తంగా 7.5 మిలియన్ల మందికి అందిస్తోంది.

ఈ ప్రోగ్రామ్ చూసేందుకు ndtv.in/iconsofbharat లాగాన్ అవ్వండి.

Icons of bharat: Real Indian success story Series on ndtv

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News