Monday, May 6, 2024

ఐదు విప్లవాలతోనే అన్నదాత ఆదాయం రెట్టింపు

- Advertisement -
- Advertisement -

పాడి పంటలకు రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యం

పాడి రైతులకు రూ.4 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం
రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు జరపుతున్న రాష్ట్రం
తెలంగాణ విజయ మెగా డెయిరీ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : పాడి, పంటకు రాష్ట్ర ప్ర భుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుందని, పాడి రైతులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్‌ను ప్రభుత్వం ప్రకటించిందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం, రావిర్యాల గ్రామ పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణంలో 246 కోట్ల వ్యయంతో తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో అత్యాధునిక మెగా డెయిరీ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనులు, భూగర్బ శాఖల మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రాంరభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీని కాపాడుకోవాలనే ధృడ సంకల్పంతో రెండు సంవత్సరములలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్రంలో సహకార రంగానికి సంబంధించి దేశంలో పాడి పంట ఇబ్బంది వచ్చినప్పుడు పాడి పైన ఆధార పడే సన్నకారు చిన్నకారు రైతాంగానికి చేయూత నివ్వాలనే సంకల్పంతో విజయ డెయిరీ ప్రారంభమైనదని, 2014 తెలంగాణ రాష్ట్రం రాకముందు విజయ డెయిరీ మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పట్లో ఒక లక్ష లీటర్ల పాలు సేకరించేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతాంగాన్ని ప్రోత్సహించి, ఆర్థికంగా తో డ్పాటునందించి దేశంలో ప్రైవేట్ పోటీ రంగంలో విజయ డెయిరీ మొదటి స్థానంలో ఉందన్నారు.

2014 లో 300 కోట్ల టర్నోవర్ ఉండేదని నేడు 750 కోట్ల టర్నోవర్ తో విజయ తెలంగాణ ముందుకు వెళుతుందన్నారు. నాలుగున్నర లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రై తు బం ధు పథకం ద్వారా 73 వేల కోట్లు, రైతు భీమా ద్వారా 1500 కోట్లు, రైతు రుణమాఫీ 21 వేల కోట్లు, 24 గంటల ఉచిత కరెంటు కోసం సంవత్సరానికి 10 వే ల కోట్లు నెలకు వెయ్యి కోట్లు, పాడి రైతులకు 350 కో ట్ల ఇన్సెంటివ్ అందజేయడం జరిగిందని తెలిపారు. సి ఎం కెసిఆర్ సరైన ఆలోచనతో రైతులను ప్రోత్సహించడానికి హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేతా విప్లవం, గులా బీ విప్లవం, పసుపు విప్లవం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. ఈ విప్లవాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు.

హరిత విప్లవం: రాష్ట్రంలో 2014కు ముందు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించడం జరిగేదని, రాష్ట్రము ఏ ర్పడిన తరువాత 3.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పంట లు విస్తృతంగా దిగుబడి చేసుకోని పంజాబ్, హరియాణా రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

నీలి విప్లవం: రాష్ట్రంలోని మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీసి వాటిలో కోట్లాది చేప పిల్లలను పెంచి మత్స సంపదను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. శ్వేతా విప్లవం ద్వారా 1. 50 లక్షల లీటర్ల నుండి 4 లక్షల లీటర్ల పాలు సేకరించే స్థాయి ఎదిగిందన్నారు. గులాబీ విప్లవం ద్వారా 11 వేల కోట్ల రూపాయలుతో గొల్ల కురుమల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గొర్రెలను ఇవ్వడం జరిగిందన్నారు. పసుపు విప్లవం ద్వారా రాష్ట్రం లో ఆయిల్ ఫామ్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వృత్తి ఏదైనా ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విజయ డెయిరీ ని బలోపేతం చేసుకొని దానిపైన వచ్చిన లాభాలు రైతులకు వస్తాయని తెలిపారు. ప్రతి పాడి రైతు విజయ డెయిరీకి పాలు ఇచ్చే వి ధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై పాడి పశువులు, ఉచితంగా నట్టల మందు, మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులు 28 వరకు సంస్థలు ఉన్నాయని, మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ,ఢిల్లీ , ముంబయిలో డిమాండ్ ఉన్నాయని వెల్లడించారు. ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ అదేవిధం గా వేలాదిమంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 అవు ట్ లెట్లు ఉన్నాయని, 600 పార్లర్లు వీటిని ఇంకా పెంపొందించు కుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో ఉన్నారన్నారు. చనిపోయిన గేదెల స్థానంలో ఇన్సూరెన్స్ ద్వారా గేదెలను అందజేస్తామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపే తం కావాలన్నారు. కుల వృత్తులకు ప్రభుత్వం చేయూత నిస్తుందన్నారు. విజయ డైరీకి సంబందించిన 14రకాల ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సిలు బొగ్గారపు దయానంద్, నవీన్, జిల్లా చైర్‌పర్సన్ తీగల అనిత రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, టిఎస్‌ఎస్ ఎల్డిఎ సిఇఒ మంజువాణి, జిల్లా కలెక్టర్ హరీష్, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమేహన్ , ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News