- Advertisement -
మెల్బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరగాల్సిన కామన్వెల్త్ వన్డే సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం అధికారికంగా ప్రకటించింది. 2021 జనవరిలో ఆస్ట్రేలియాలో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగాల్సిన ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వివరించింది. ఇక ఈ సిరీస్ మళ్లీ ఎప్పుడూ జరుగుతుందనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో సిరీస్ను వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి బోర్డు వచ్చింది. జనవరి ఆరంభంలోనే సిరీస్ జరగాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
IND vs AUS Women ODI Series Postponed
- Advertisement -