- Advertisement -
న్యూఢిల్లీ : భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, జీవన ధార అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్ టీవీ ( సంసద్ టీవీ)ని ప్రధాని మోడీ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీని ప్రారంభించడం సందర్భోచితంగా ఉందన్నారు. కొన్నేళ్లుగా మీడియా పాత్ర కూడా మారిపోయిందని, ఇది విప్లవాన్ని తీసుకు వస్తోందని, అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టు మీడియా కూడా మారడం చాలా ముఖ్యమని సూచించారు.
- Advertisement -