- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 16,752 మందికి కరోనా సోకింది. 113 మంది బాధితులు మృతి చెందారు. అదే సమయంలో మరో 11,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కి చేరింది. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,57,051 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ప్రస్తుతం 1,64,511 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ నుంచి మొత్తం 1.07 కోట్ల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకు 1.43 కోట్ల మందికిపైగా కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న పరీక్షించిన 7,95,723 నమూనాలతో సహా ఫిబ్రవరి 27 వరకు పరీక్షించిన మొత్తం 21,62,31,106 మందికి కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.
- Advertisement -