Sunday, May 12, 2024

3వేలు దాటిన పాజిటీవ్ కేసులు.. 50మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 3,688 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4.30కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 2,755మంది వైరస్‌ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,23,803మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 188కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Reports 3688 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News