Friday, May 3, 2024

భారత్‌లో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజులోనే 21వేల కేసులు

- Advertisement -
- Advertisement -

India seen record 210903 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీః భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిని 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో ఏకంగా 20,903 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని, కరోనాతో మరో 379మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడిచింది. నిన్న ఒక్కరోజే 20వేల మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6 లక్షల 25వేలు దాటింది. ఇక, కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,213 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 2,27,439మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 3,79,893 మంది బాధితులు కోలుకున్నారు.

India seen record 210903 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News