Wednesday, May 1, 2024

రెండో టెస్టులో భారత్ గెలుపు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో భారత్-ఇంగ్లాండ్ జట్లు చెరో టెస్టు గెలిచి సమంగా ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 69.2 ఓవర్లలో 296 పరుగులు చేసి ఆలౌటైంది.  ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు జాక్ క్రాలే(73), బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్ లే(36), బెన్ డకెట్(28), జానీ బయిర్ స్టో(26) రెహాన్ అహ్మాద్(23), ఓలీ పోప్(23), జోయ్ రూట్ (16), బెన్ స్టోక్స్(11), షోయబ్ బసీర్ (0) పరుగులు చేసి ఔటయ్యారు. జేమ్స్ అండర్ సన్ ఐదు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. భారత్ బౌలర్లలో అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, ముఖేశ్ కుమార్ తలో ఒక వికెట్ తీశారు.

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 396
భారత సెకండ్ ఇన్నింగ్స్: 255
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 253
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్: 292

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News