Saturday, May 18, 2024

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

 

VicePresident election

న్యూఢిల్లీ: తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు ఉభయసభలు..లోక్ సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులు నేడు(శనివారం) ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్ డిఏ తరఫున జగ్దీప్ ధన్కర్, ప్రతిపక్షం తరఫున మార్గరేట్ అల్వా పోటీపడుతున్నారన్నది తెలిసిన విషయమే. ఓటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఓటింగ్ ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాతే లెక్కింపు ఉండగలదు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్, అమిత్ షా తదితర ప్రముఖులందరూ తమ ఓటును వినియోగించుకున్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం తమ పార్టీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

 

 

PM Modi casting vote

TMC letter

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News