హైదరాబాద్ : కరోనా అనుమానంతో చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేసిన ఇండోనేషియాకు చెందిన వారు ఆదివారం రాత్రి బిర్యానీ కోసం నానా హంగామా చేశారు. ఇండోనేషియాకు చెందిన 20మంది బృందం మతప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది కరీంనగర్కు వెళ్లగా మిగతా వారు నగరంలోని పాతబస్తీలో ఉన్నారు. కరీనంగర్లో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు మిగతావారు నగరంలో ఉండగా వారిని కూడా చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. వీరు మాకు బిర్యానీ పెట్టాలని అర్ధరాత్రి గొడవ చేసినట్లు తెలిసింది. క్వారంటైన్లో ఉన్నారని ఎంతగా చెప్పినా కూడా వారు వినిపించుకోనట్లు తెలిసింది. జనతా కర్ఫూలో భాగంగా దేశం మొత్తం కర్ఫూలో ఉండడంతో అన్ని షాపులు, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. వారికి బిర్యానీ పెట్టాలన్నా ఎక్కడా లభించని పరిస్థితి నెలకొంది. చివరికి వారికి పోలీసులు వచ్చి సర్ధిచెప్పినట్లు తెలిసింది.