Friday, April 26, 2024

అడవుల సంరక్షణ, అభివృద్ధికి కెసిఆర్ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Indrakaran plant tree in harithaharam at nirmal

నిర్మల్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ద్యేయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆరో హరితహారం కార్యక్రమంలో భాగంగా గండి రామన్న హరితవనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. అడవుల సంరక్షణ, అభివృద్ధికి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు. రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామన్నారు. హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ షారుఖీ, సిఎఫ్ వినోద్ కుమార్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News