Friday, April 26, 2024

పవన్ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యా

- Advertisement -
- Advertisement -

Interview with Ananya Nagalla

 

‘మల్లేశం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నాయిక అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మీడియాతో మాట్లాడుతూ “జీవితంలో ఊహించని ఆనందం ఎదురైతే మనం వెంటనే దాన్ని నిజం అనుకోము. ఇదోదే కల అనిపిస్తుంటుంది. ‘వకీల్ సాబ్’ చిత్రంలో నా సెలెక్షన్ జరిగిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. కొన్ని రోజులు అయ్యాక గానీ నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాను అనే నమ్మకం కలగలేదు. ఇక ఈ చిత్రంలో నా పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. తన పనేదో తను చూసుకునే అమ్మాయిలా కనిపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ మన జీవితంలో తరుచుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక అమ్మాయికి సమస్య వస్తే… అయ్యో తనకు ఇలా జరిగిందా అని బాధపడేలా ఉంటుంది.

నా క్యారెక్టర్ మీద ప్రేక్షకులు జాలి చూపిస్తారు.- పవన్ కళ్యాణ్‌తో సెట్‌లో గడిపిన సమయాన్ని మర్చిపోలేను. ఆయనతో సరదాగా టైమ్ గడిచింది. – నివేదా థామస్, అంజలితో పోల్చుకుంటే నాకు అనుభవం తక్కువ. కాబట్టి వారితో ఎప్పుడూ నటనలో పోటీ పడాలని అనుకోలేదు. వీలైనంత వరకు వాళ్ల దగ్గర నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నించాను గానీ కాంపిటేషన్‌గా ఫీలవలేదు. అంజలితో చాలా ఫన్‌గా ఉండేది. ఆమె ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండేది. నివేదా కొద్దిగా సీరియస్. తన ఆలోచనలు కూడా సీరియస్‌గా ఉండేవి. ఇద్దరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు శృతి హాసన్‌తో కాంబినేషన్ సీన్స్ ఉండవు. కోర్టు సీన్ చేసేప్పుడు పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించాను. అప్పుడు నా నటన చూసి ఆయన ‘మీ యాక్టింగ్‌లో ఎమోషన్ బాగా ఉంది. సీన్ రిపీట్ చేసినా అదే ఎమోషన్‌లో ఉంటున్నారు’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News