దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అదరగొట్టింది. అసాధారణ ఆటతో చెలరేగిన చెన్నై పది వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (63), పురాన్ (33), మయాంక్ (26), మన్దీప్ (27) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై 17.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డుప్లెసి స్, షేన్ వాట్సన్ విధ్వంసక బ్యాటింగ్తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. చెలరేగి ఆడిన డుప్లెసిస్ 53 బంతుల్లోనే 11 ఫోర్లు, సిక్స్తో అజేయంగా 87 పరుగులు చేశాడు. వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, మరో మూడు సిక్స్లతో 83 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై 10 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది.
IPL 2020: CSK win by 10 wickets against SRH