Monday, May 6, 2024

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించేలా చూడాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కోరిన బిజెపి నేత డికె అరుణ

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా డికె.అరుణను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డికె. అరుణ గవర్నర్ తమిళసైని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆగస్ట్ 24 హైకోర్టు తీర్పు ఇచ్చిందని, సెప్టెంబర్ 4 కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని రెండు సార్లు స్పీకర్, సెక్రటరీలకు కలవడం జరిగిందని, అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు అందుబాటులో లేరని ఆమె వెల్లడించారు.

ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం లేదని, అసెంబ్లీ స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో గవర్నర్ ను కలవడం జరిగిందని వివరించారు. హైకోర్టు తీర్పు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్, తెలంగాణ రాజ పత్రాన్ని గవర్నర్‌కు అందజేసినట్లు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారని, గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్ తో మాట్లాడుతానని గవర్నర్ చెప్పినట్లు, స్పీకర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. నాలుగు రోజుల కితం హైకోర్టు ఉత్తర్వులు, ఈసీ నోటిఫికేషన్ అసెంబ్లీకి సమర్పించారు. తెలంగాణ స్టేట్ గెజిట్ తదుపరి సంచికలో డికె అరుణ ఎన్నికను ప్రచురించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి ఈనెల 4వ తేదీన లేఖ రాసింది. అదే విధంగా గెజిట్‌లో ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ప్రచురించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి ఈసీ సెక్రటరీ లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్‌పై సీఈవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News