Tuesday, May 14, 2024

గంటన్నరలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Jeedimetla Police Chase boy Kidnap Case

మేడ్చల్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధితో బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం అయింది. కేవలం గంటన్నర వ్యవధిలోనే కిడ్నాప్ కు గురయిన బాలుడి ఆచూకీ కనుగొన్నారు. కిడ్నాపర్ నుండి బాలుడిని సురక్షితంగా రక్షించి మహిళా కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, సంజయ్ గాంధీనగర్ లో నివాసం ఉండే శ్రీకాంత్ కుమారుడు (రామకృష్ణ)13 నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన జీడిమెట్ల సిఐ బాలరాజు, ఎస్ఐ లు, మన్మథ్, సుమన్, గౌతమ్, తదితర సిబ్బంది సిసి కెమెరాల ఆధారంగా కిడ్నాప్ కేసు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసు బృందం ముమ్మర గస్తీ నిర్వహించారు. గంటన్నర వ్యవధిలోనే మహిళ కిడ్నాపర్ ను షాపూర్ నగర్ లో నడుచుకుంటూ వెళ్తుండగా పట్టుకొని బాలుడు రామకృష్ణ ను సురక్షితంగా కాపాడారు. బాలుడిని ఎత్తుకెళ్లింది తానేనని మహిళ తెలపటంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలుడిని కిడ్నాప్ ఎందుకు చేసింది, అమ్మడానికా? లేక ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసుల సేవలను గుర్తించిన పలువురు స్థానికలు పోలీసులపై ప్రశంసలు గుప్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News